లబ్ధిదారునికి బీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ 2,00,000/– రూపాయల చెక్కును లబ్ధిదారుని

Published: Tuesday April 04, 2023
బోనకల్, ఏప్రిల్ 3 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందపురం(ఏ) గ్రామంలో షేక్ నాగుల మీరా ఇటీవల కరెంటు షాక్ ప్రమాదంతో మరణించగా వారికి బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన 2,00,000/–లక్షల రూపాయల చెక్కును వారి సతీమణి షేక్ సహిన కి మండల స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి నేరుగా వారి ఇంటికి వెళ్లి లబ్ధిదారునికి, వారి కుమార్తెలకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సీఎం కేసీఆర్ పార్టీ సభ్యత్వం కలిగినటువంటి ఏ నాయకునికి కార్యకర్తకు కష్టం వచ్చినా పార్టీ అండగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీ సభ్యత్వం కలిగిన నాయకునికి ఇన్సూరెన్స్ చెల్లించి కష్టం వచ్చిన కార్యకర్త కుటుంబానికి అండగా ఉండాలని ఉద్దేశంతో పార్టీ ఇన్సూరెన్స్ ను చెల్లించి మనకి లబ్ధి చేస్తూ మనకి అండగా ఉంటున్న సీఎం కేసీఆర్ కి మనమందరం అండగా ఉండాలని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబానికి ఎల్లవేళల పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మాజీ మండల అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సైదా, బంధం నాగేశ్వరరావు, పారా ప్రసాద్, ఇటికల శ్రీనివాసరావు, గండమాల చుక్క రావు, రంగా హనుమంతరావు, గద్దల వెంకటేశ్వర్లు,వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.