గ్రామీణ వాసులు బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోవాలి

Published: Thursday January 20, 2022

బీరుపూర్, జనవరి 19 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ రేకులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ సినియర్ మేనేజర్ వీరన్న బీరుపూర్ బ్రాంచ్ మేనేజర్ గిరిబాబు మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలు గ్రామీణ ప్రాంత వాసులు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాత తీసుకోవాలని ఖాతాదారులు ఇన్సూరెన్స్ తప్పకుండ చేసుకోవాలని కోరారు. ప్రధాన మంత్రి సురక్ష యోజన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన పథకం ఎస్బిఐ లైఫ్ ఇన్సురెన్సు తదితర పథకాలను ఖాతాదారులు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏలగందుల లక్ష్మి అశోక్ ఉప సర్పంచ్ వార్డ్ సభ్యులు ప్రజలు మహిళలు బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.