దళిత బంధు యూనిట్లను త్వరగా పూర్తి చేయాలి

Published: Friday July 08, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో జూలై 07 ప్రజా పాలన :  దళితబంధు యూనిట్లను వేగవంతంగా గ్రౌండింగ్ చేసి శనివారం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత గ్రౌండింగ్ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో గ్రౌండింగ్ అధికారులతో దళిత బంధు పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటి వరకు దళిత బంధు పథకం క్రింద మంజూరైన ట్రాన్స్ పోర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్, రిటైల్ రంగాలలో పాటు పౌల్ట్రీ, డైరీ రంగాలలోని యూనిట్ లను ఏలాంటి పెండింగ్ లేకుండా అన్ని యూనిట్లను ఈ శనివారం వరకు గ్రౌండింగ్ పనులను పూర్తి చేసి అట్టి వివరాలు ఆన్ లైన్ లో పొందు పర్చాలన్నారు.  ఈ సమావేశంలో  యస్సి కార్పొరేషన్ ఇడి బాబు మొజెస్, డి ఆర్ డి ఓ కృష్ణన్, జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, డిప్యూటీ సీఈఓ సుభాషిణి, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అనీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.