కేశవపట్నం వ్యాపార వర్తక సంఘం కమిటీ నియామకం శంకరపట్నం ఫిబ్రవరి 26 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Monday February 27, 2023

శంకరపట్నం మండల కేంద్రం మాధవసాయ్ గార్డెన్ లో కేశవపట్నంలోని వివిద రకాల వ్యాపార వర్తకులు ఆదివారం వ్యాపార వర్తక సంఘం కమిటిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త బండారు తిరుపతి అధ్యక్షత నిర్వహించారు. కేశవపట్నం వ్యాపార వర్తక సంఘం అధ్యక్షుడిగా గజ్జెల్లీ హనుమంతు, ఉపాధ్యక్షుడిగా బొంగొని శ్రీనివాస్, సెక్రటరీగా బొంగొని అభిలాష్, కోశాధికారిగా గుర్రం శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబెర్స్ గా పంజాల నరేందర్, గూల్ల రాజు,  ప్రసాద్ ,సోమేశ్వర్ ,జహంగీర్ , బొంగొని కుమార్ , శ్రీను , బొజ్జ కుమార్, మురళి యాదవ్, రమేష్, మెకానిక్ శ్రీను, మెకానిక్ సురేష్, సాగర్, సుధాకర్, రాజశేఖర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి మండలం కేంద్రంలోని వ్యాపార వర్తకులందరూ హాజరయ్యారు.