నేడు మండలంలో ఎంపీ నామా, జడ్పీ చైర్మన్ పర్యటన

Published: Thursday November 10, 2022
బోనకల్, నవంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలో ఖమ్మం జిల్లా ఎంపీ  లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు,  జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మండలంలోని పలు గ్రామాలలో గురువారం  పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 10:00 గంటలకు కలకోట నుండి నారాయణపురం బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం కలదు.
  11:00 గంటలకు మోటమర్రి గ్రామం నందు సీసీ రోడ్డు ప్రారంభోత్సవం కలదు. అనంతరం మండలంలోని పలు కుటుంబాలను పరామర్శించనున్నారు.కావున టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.