నేడు మండలంలో ఎంపీ నామా, జడ్పీ చైర్మన్ పర్యటన
Published: Thursday November 10, 2022
బోనకల్, నవంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలో ఖమ్మం జిల్లా ఎంపీ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మండలంలోని పలు గ్రామాలలో గురువారం పర్యటించనున్నారు. ముందుగా ఉదయం 10:00 గంటలకు కలకోట నుండి నారాయణపురం బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం కలదు.
11:00 గంటలకు మోటమర్రి గ్రామం నందు సీసీ రోడ్డు ప్రారంభోత్సవం కలదు. అనంతరం మండలంలోని పలు కుటుంబాలను పరామర్శించనున్నారు.కావున టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
Share this on your social network: