ఘనంగా జరిగిన మడుపల్లి హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు

Published: Thursday March 30, 2023

మధిర మార్చ్ 29 ప్రజాపాలన ప్రతినిధి: ది:28-3-2023 సాయంత్రం జరిగిన జడ్పిహెచ్ఎస్ మడుపల్లి వార్షికోత్సవ సభకి హెచ్ఎం కె.పద్మావతి అధ్యక్షత వహించారు.ముఖ్య అతిథిగా మొండితోక.లత మధిర మున్సిపాలిటీ చైర్మన్,విశిష్ట అతిథిగా ఎంఈఓ వై.ప్రభాకర్ రావు పాల్గొన్నారు.మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శీలం.విద్యాలత, కౌన్సిలర్ తోగరు.వరలక్ష్మి, శీలం.వెంకటరెడ్డి,చెరుకూరి వెంకటేశ్వరరావు,కటకం. రాంబాబు.రంగారావు. లక్ష్మణరావు అతిధులుగా పాల్గొన్నారు.విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన ఉత్తమ విద్యను అభ్యసించాలని ముఖ్యఅతిథి లత ప్రసంగించారు.ఎంఈఓ వై. ప్రభాకర రావు మాట్లాడుతూ విద్యార్థులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పరీక్షలు రాయాలని కోరారు.అనంతరం విద్యార్థిని,విద్యార్థులకు బహుమతి ప్రధానం జరిగినది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి.ఉపాధ్యాయులు షేక్.నాగూర్ వలి,తోట. నరసింహారావు, వంకాయలపాటి. వెంకటేశ్వరరావు,బూసా. కోటేశ్వరరావు,పి.కిషోర, కె. బాబురావు,S.రామిరెడ్డి,కె. కృష్ణయ్య,బి.చైతన్య,టి. జ్యోతిర్మాయి,బి.రాణి, చిట్టిబాబు, ఎస్ఎంసి చైర్మన్ వేల్పులు రాజేశ్వరి పాల్గొన్నారు. గ్రామ నివాసి ఇ ఫ్రాయిమ్ రూ:12000/- లు బహుమతులకు వితరణగా అందజేశారు.