పిల్లిగుట్ట వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి 21000/- విలువ చేసే చటారి మరియు 22000/- విలువ చేసే వెండ

Published: Monday February 08, 2021

మధిర: కలయిక వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఇరుకుళ్ళ బాలకోటేశ్వరరావు అధ్వర్యంలో పిల్లిగుట్ట వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి 21000/- విలువ చేసే చటారి మరియు 22000/- విలువ చేసే  వెండి హారతి పళ్ళెము, వెండి తీర్థపుగిన్నె  ఆతుకూరు గ్రామ మాజీ సర్పంచ్, తెరాస నాయకుడు అబ్బూరి రామకృష్ణ కు అందచేసినారు  .ఆతుకూరు మాజీ సర్పంచ్ అంకం అప్పారావు, మీనుగు శంకర్, ఆలయ అర్చకులు శ్రీమాన్ కడియాల కుటుంబరావు, యితర గ్రామపెద్దలు పాల్గొన్నారు.   వెండి చటారి కాజ శ్రీనివాసరావు ,శ్రీదేవి దంపతులు విరాళముగా ఇవ్వగా. వెండి పాత్రలు కలయిక వాకర్స్ క్లబ్ సభ్యులు ఇచ్చినారు. స్వామివారి కైంకర్యాలకు వెండి సామాగ్రి వితరణ చేసినందుకు కలయిక వాకర్స్ క్లబ్ ను పలువురు అభినందించారు.వాకర్స్ క్లబ్ సభ్యులు నంబూరి శ్రీహరి, కటికల సీతారామరెడ్డి, వేమూరి సునీల్, జుజ్జూరు నరసింహారావు, కర్లపూడి వాసు, చావలి రామరాజు, డోకుపర్తి సత్యంబాబు, కోనా జగదీష్, కన్నెధార చంద్రశేఖర్  గుర్రం శ్రీనివాసరావు, వంగూరి గోపి, నాళ్ళ నారాయణ, నాళ్ళ శ్రీను, కేతేపల్లి శ్రీనివాసరావు, చిన్నం శ్రీనివాసరావు, చెండ్యాల కోటేశ్వరరావు, తమ్మవరపు శ్రీనివాసరావు, గడ్డమణుగు భద్రం, చిట్టేల శేషు, అప్పన లక్ష్మీనారాయణ, నాట్యాచార్యుడు బ్రహ్మం, రమేష్, పరాంకుశం శ్రీనివాసరావు, బోణాల నాగేశ్వరరావు, మైలవరపు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. భజనలు, భక్తిగీతాలాపన తదుపరి ఆలయ ప్రాంగణంలో  వాకర్స్ సభ్యుడు వేమూరి సునీల్  అందరికీ  భోజనం ఏర్పాటు చేశారు.