గ్రామంలోని విద్యుత్ సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో వినతిపత్రం

Published: Friday September 09, 2022
బోనకల్ ,సెప్టెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని బోనకల్ గ్రామంలో గతకొంతకాలంగా విద్యుత్ సమస్యలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నందున గ్రామంలోని అఖిలపక్ష నాయకులు విద్యుత్ ఏ.ఇ ఉమామహేశ్వరరావు గారిని కలిసి గ్రామంలోని విద్యుత్ అంతరాయాన్ని పరిష్కరించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా మిడిల్ పోల్స్ ఏర్పాటు చేసి గ్రామస్తులకు విద్యుత్ సౌకర్యాలను కల్పించాలని ఒరిగిపోయిన స్తంభాలను సరిచేసి గ్రామంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇట్టి విషయమై సానుకూలంగా స్పందించిన ఏ. ఇ నెల రోజులలో విద్యుత్ అంతరాయ సమస్యను పరిష్కరించడానికి కృషిచేస్తామని, వారం రోజులలో గ్రామం మొత్తం పర్యటించి సమస్యలను సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి కృషిచేస్తామని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి తెల్లకుల శ్రీనివాసరావు, బి.జె.పి జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోత్ నాగేశ్వరరావు, ఎం.పి.టి.సి, మండల వైస్ ఎంపీపీగుగులోత్ రమేష్, ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ పాల్గొన్నారు.