కొడిమ్యాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా డాక్టర్ పులి వెంకటేష్ గౌడ్ ఏకగ్రీవ ఎన్నిక.

Published: Friday September 24, 2021
కొడిమ్యాల, సెప్టెంబర్ 23, (ప్రజాపాలన ప్రతినిధి) : కొడిమ్యాల మండలంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా డాక్టర్ పులి వెంకటేశ్ గౌడ్ ను నియమించి నందున పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది. మాజీఎమ్మెల్యే బొడిగె శోభ టిఆర్ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించినప్పుడు ప్రస్తుత చొప్పదండి శాసన సభ్యులు సుంకె రవిశంకర్ ఎమ్మెల్యే గా గెలుపు సాధించాలని రవి శంకరన్న సోదరసేన అనే వాట్సప్ గ్రూప్ ను క్రియేట్ చేసి పార్టీబలోపేతానికి ఎంతగానో కృషి చేసినందున మండలంలోని అన్నివర్గాల ప్రజలతో సత్ సంబంధాలు కలిగి అందరి మన్ననలను పొందినందున పార్టీ శ్రేణులు.. శాసనసభ్యులు రవిశంకర్ ఆలోచన అనుసారం తిరిగి పులి వెంకటేశ్ ను టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమించడం జరిగింది, అంతే కాకుండా మండల కమిటీలో రోడ్డ శరత్ ను,పర్లపల్లి ప్రభుదాస్ లను ఉపాధ్యక్షులుగా, నేరల్ల మహేష్ ను ఎస్సీసెల్ అధ్యక్షులుగా, గడ్డం లక్ష్మా రెడ్డిని యూత్ కమిటీ అధ్యక్షుడిగా కొత్తూరు స్వామిని పట్టణ అధ్యక్షులుగా. అబ్దుల్ శుకుర్ ను మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా, బండి రాజును బిసి సెల్అధ్యక్షునిగ ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాముపార్టీ కొరకు చేసిన కృషిని గుర్తించి తగిన పదవులను ఇచ్చినందుకు శాసనసభ్యులు రవిశంకర్ కు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కృష్ణారావుకు కొడిమ్యాల పిఎసిఎస్ చైర్మన్ రాజ నర్సింగరావుకు ఎంపీపీ స్వర్ణలత రాజ నర్సింగరావుకు వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్ కు జెడ్పిటిసి ప్రశాంతి కృష్ణారావుకు కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ ఓల్లాల లింగ గౌడ్ కు, ఏఏంసి చేర్మెన్ తిరుపతి రెడ్డి లకు పార్టీ శ్రేణులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు