జన్మదిన సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి మాజీ కార్పొరేటర్ గంధం రూ1 లక్ష విరాళం

Published: Tuesday February 21, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 20 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు జన్మదిన సందర్భంగా డివిజన్లోని శ్రీరామ కాలనీ   మహంకాళమ్మ ఆలయ పునర్నిర్మాణం కొరకు రూ 1 రూపాయల చెక్కును  అలయ కమిటీ సభ్యులకు అందజేశారు. అనంతరం మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్
నాయకులు,ఇంద్రసేన రెడ్డి, మధుసుధన్ రెడ్డి ,కొప్పు నర్సింగ్ రావు ,శ్రీనివాస్ రెడ్డి ,చంబు సాయి, వెంపటి శ్రీను ,మనీష్ ,తుట్ నరసింహ, ఆలే రమేష్, ఆలయ కమిటీ అధ్యక్షుడు కేశవరెడ్డి, ప్రధాన కార్యదర్శి విష్ణు, సభ్యులు రాంచంద్రాచారి ,బాలకృష్ణ చారి,గొపి చారి,యాలాల వెంకటేష్ చారి ,రఘు చారి ,గోపు చారి ,నరసింహ చారి, ఉపేందర్ చారీ తదితరులు పాల్గొన్నారు.