ఎస్సీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ ధీరజ్ కుమార్ మధిర
Published: Thursday September 15, 2022
సెప్టెంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు
మధిర పట్టణంలోని బంజారా బంజారా కాలనీనందు ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహాన్ని స్వచ్ఛ గురుకులాల, వసతి గృహాల సందర్శనలో భాగంగాఈరోజు ఉదయం మధిర కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ధీరజ్ కుమార్ సందర్శించారు. సందర్భంగా వసతి గృహంలోని, వంటశాలను, బాత్రూమ్స్ ను, వసతి గృహ పరిసర ప్రాంతాలను, పరిశీలించి, విద్యార్థులతో ముచ్చటించారు. వసతిగృహం వార్డెన్ వరలక్ష్మి పనితీరుపై, వసతి గృహంపై సంతృప్తికరం వ్యక్తం చేశారు
Share this on your social network: