మంత్రి అజయ్ కి కృతజ్ఞతలు తెలిపిన సుబ్రహ్మణ్యం
Published: Monday August 08, 2022
మధిర రూరల్ ఆగస్టు 7 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు కోర్టుకు ప్రభుత్వ న్యాయవాదిగా నియామకమైన దేవరపల్లి సుబ్రహ్మణ్యం ఆదివారం ఖమ్మం మంత్రి క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దేవరపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మధిర కోర్టుకు ఏజీపీగా నియామకం అయ్యేందుకు కృషి చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి సహకరించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కి ఎమ్మెల్సీ తాత మధుకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు టిఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు కనుమూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు
Share this on your social network: