వైయస్సార్ టిపి ఆధ్వర్యంలో ఘనంగా జాతిపిత జయంతి వేడుకలు

Published: Monday October 03, 2022
బోనకల్, అక్టోబర్ 2ప్రజాపాలన ప్రతినిధి: మండల వైయస్సార్ టిడిపి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా బోనకల్ మండలంలోమహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బోనకల్ మండల అధ్యక్షుడు ఇరుగు జానేసు, మండల అధికార ప్రతినిధి మర్రి ప్రేమ్ కుమార్, యూత్ మండల అధ్యక్షుడు మందా నాగరాజు మాట్లాడుతూ హింసించే ఆయుధముగా బ్రిటిష్ పాలకులను గడగడలాడించి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్ముని ఆశయాలు మనకి ఆదర్శమని అన్నారు. ఆయన చూపిన శాంతి అహింస దారులను మన మార్గముగా మలుచుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు ఎస్ డి సైదా బాబు, యూత్ అధ్యక్షుడు నాగరాజు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు దొంత రవి ,అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్, గ్రామ అధ్యక్షుడు ఎస్.కె మౌలాలి, ఆళ్ళ పాడు గ్రామ అధ్యక్షుడు కందుల వెంకయ్య, గార్లపాడు గ్రామ అధ్యక్షుడు కట్ల రాజయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area