సిటీ స్కానింగ్ పరీక్షలు 2 వెలకే - ఎమ్మెల్యే సంజాయ్ కుమార్

Published: Thursday May 13, 2021
జగిత్యాల, మే 12 (ప్రజాపాలన ప్రతినిధి):  జగిత్యాల నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు పట్టణాలలో రోజు రోజుకు కరోనా విజృంబిస్తుండడంతో జగిత్యాల పట్టణంలోని స్కానింగ్ సెంటర్ యాజమాన్యం అయిన డా.సతీష్ కుమార్ డా.బాస శంకర్ డా.సుజిత్ డా.సురేందర్ తో బుధవారం రోజున స్థానిక ఎమ్మెల్యే డా.సంజాయ్ కుమార్ చర్చించి కరోనా నిర్ధారణ పరీక్ష (సిటీ చెస్ట్)లకు 2 వేల రూపాయలు ధర నిర్ణయించగా సహకరించిన డయాగ్నొస్టిక్ సెంటర్ యాజమాన్యంకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. పట్టణంలోని ఏ స్కానింగ్ సెంటర్లో అయిన ఇక నుండి 2 వేల రూపాయలు కానుంది. ప్రత్యేక ధర నిర్ణయించినందుకు ఐఎంఏ తరుపున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు