ఘనంగా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ జన్మదిన వేడుకలు ** బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో **

Published: Thursday November 10, 2022

ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 9 ప్రజాపాలన, ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలో బ్రాహ్మణ సమాజ్ ఆధ్వర్యంలో బ్రాహ్మణవాడలో గల శ్రీ వాసవి విద్యా మందిర్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, సీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో 100 మంది రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో వైరాగారే ప్రతాప్, ఆమ్టే అనుఫ్ కుమార్, (సోను) వారణాసి శ్రీనివాస్, వైరగారే మనోజ్, బలవంత్ రావు, దేశ్ పాండే రవికుమార్, ఓజ్జేల గిరీష్, ఓజ్జల శేఖర్, మసాదే సతీష్, దేశ్ముఖ ప్రవీణ్,పాఠశాల విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.