షర్మిల రాకతో జన సంద్ర మైన రావినూతల
Published: Tuesday June 14, 2022
పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు
బోనకల్,జూన్13 ప్రజా పాలన ప్రతినిధి: వై ఎస్ ఆర్ టి పి వ్యవస్థాపకురాలు షర్మిల పాదయాత్ర కు మండలంలోని రావినూతల గ్రామ ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. ప్రజలు అడుగడుగు నా ఘన స్వాగతం పలికి ఆమెకు హారతులు పట్టి నీరాజనాలు పలికారు.దీంతో రావినూతల గ్రామం లోని ప్రధాన రహదారులన్నీ ప్రజలతో కిటకిట లాడి జనసాంద్ర మయ్యాయి.బహిరంగ సభ అనంతరం చిన్నా,పెద్ద అనే తారతమ్యం లేకుండా ఆమె అడుగులతో కలిపి అడుగేశారు.ఆమెతొ పాదయాత్రలో స్వఛ్చందం గా పాల్గొని తమ మద్దతు తెలియ జేశారు.తొలుత ఆమె ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ టీఆరెఎస్ పార్టీ పాలన పై విరుచుకు పడ్డారు.రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ ప్రజల సంక్షేమం కంటే కుటుంబ సంక్షేమానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.సమస్యను పరిష్కరించలేదని ప్రశ్నిస్తే వాటిపై అక్రమ కేసులు పెడుతూ మనోవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కనీసం సమస్యను కూడా చెప్పుకొనే అవకాశం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.ప్రజలు మరికొంత కాలం ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుందని,ఆరోజు ప్రతీ ఒక్కరి సమస్యలు పరిష్కారo అవుతాయన్నారు.దీనికోసం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గ ఇంచార్జీ దొంతమాల కిశోర్,యూత్ నాయకుడు,గణపారపు మురళీ,మండల నాయకులు గణపారపు వెంకటేశ్వర్లు, మౌ లాలీ,నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు ఎస్.కే. ఇస్మాయిల్ ,సోషల్ మీడియా ఇంచార్జ్ సౌరిల్, శీలం లక్ష్మారెడ్డి. గణపరపు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: