ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలి -

Published: Friday July 01, 2022
వీఆర్ఏల డిమాండ్
 
 కొడిమ్యాల, జూన్ 30 (ప్రజాపాలన ప్రతినిధి): వీఆర్ఏల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల తాసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం వీఆర్ఏలు మాట్లాడుతూ 50 సంవత్సరాల పైబడిన వారసులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే ప్రమోషన్లు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే ఇబ్బందులకు గురి చేసే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ లు శ్రీనివాస్ రామకృష్ణ సుధాకర్ లక్ష్మణ్ సునీత సుమలత ఆమని తదితరులు పాల్గొన్నారు