ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ జిల్లా అధ్యక్షుడి ఎన్నిక

Published: Friday April 22, 2022
మంచిర్యాల బ్యూరో, ఎప్రిల్ 21, ప్రజాపాలన : మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేస్తున్న చీర్లసత్యం ఆలిండియా అగ్రగామి కిసాన్ సభ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల మధు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం బత్తుల మధు మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలని, ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పోరాడాలని ఆయన సూచించారు. రానున్న ఎన్నికల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నాయకులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి భుజంగరావు, చెన్నూరు అసెంబ్లీ కన్వీనర్ ముల్కల, కనకయ్య,ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సమద్ తదితరులు పాల్గొన్నారు.