ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం
Published: Thursday January 12, 2023
కోరుట్ల, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి ):
మెట్ పల్లి పట్టణంలో నిత్యం వందలాది మందికి నిత్యాన్నదాన కార్యక్రమం ద్వారా స్వచ్ఛంద సేవ సంస్థ ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటేబుల్ ట్రస్ట్ ఆకలి తీర్చుతున్నారు. ఈ కార్యక్రమం లో భాగంగా బుదవారం రోజున అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఇంద్రాల హరీష్ కూతురు క్రితిక జన్మదిన సందర్భంగా నిత్యాన్నదాన కార్యక్రమం ఆకలితో వున్న శరణార్థులకు అన్నదానం చేశారు.జన్మదిన వేడుకలు అనగానే అంగు అర్బటాలతో కాకుండా ఆకలితో ఉన్నవారికి ఆదుకోవడంలోనే నిజమయిన సంతృప్తి ఉందని ఈ సందర్భంగా హరీష్ తెలిపారు. ఈ మహోత్తర కార్యక్రమం నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Share this on your social network: