బెల్లంపల్లిలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన రెవెన్యూ సిబ్బంది
Published: Friday April 23, 2021
బెల్లంపల్లి మార్చి 22 ప్రజా పాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమించుకొని అక్రమకట్టడాల నిర్మించుకోవడం కబ్జాదారులకు పరిపాటి అయితే వాటిని కూల్చివేయడం రెవెన్యూ అధికారులకు అలవాటుగా మారింది. బెల్లంపల్లి పట్టణంలోని షంషేర్ నగర్ లో గత 30 సంవత్సరాలుగా వున్న పోచమ్మ తల్లి దేవాలయం స్థలాన్ని స్థానిక అధికార పార్టీ నాయకులు కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని బస్తీ ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు గురువారం నాడు స్థానిక ఎమ్మార్వో కుమారస్వామి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది వెళ్లి కూల్చివేయడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పగానే స్పందించి అక్రమ కట్టడాలను కూల్చివేసిన రెవెన్యూ సిబ్బందికి శంషే ర్ నగర్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Share this on your social network: