ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తా మధిర ఏడీఈ గా బాధ్యతలు స్వీకరించిన అనురాధ
మధిర సెప్టెంబర్ రూరల్1 ప్రజా పాలన ప్రతినిధి మధిర సబ్ డివిజన్ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని విద్యుత్ శాఖ సబ్ డివిజన్ ఏడీఈ అనురాధ పేర్కొన్నారు గురువారం ఆమె విద్యుత్ మదిరెడ్డి డివిజన్ ఏడిఈగా బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటిడిఏ ఏడిఈ గా విధులు నిర్వర్తించిన ఆమె తాజాగా జరిగిన సాధారణ బదిలీలలో భాగంగా మధిర ఏడీఈ గా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధిర డివిజన్ ప్రజలకు ఎటువంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఇప్పటివరకు మధిర ఇంచార్జి ఏడిఈగా విధులు నిర్వర్తించిన సిహెచ్ సుధాకర్ రావుని మధిర, ఎర్రుపాలెం, మామునూరు ఏఈలు నాగేశ్వరావు, వేణుగోపాల్, శ్రీనివాసరావు మరియు సబ్ ఇంజనీర్స్ అనూష, లావణ్య, ప్రవీణ్ సబ్ డివిజన్ సిబ్బంది చెరుపల్లి శ్రీధర్ మరియు ఈఆర్వో ఏఏఓ ప్రభాకర్ విద్యుత్ శాఖ సబ్ సిబ్బంది ఘనంగా సన్మానించారు.
Share this on your social network: