జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ కార్పొరేటర్ కు వినతి పత్రం

Published: Tuesday March 16, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రం, బస్తీ దవాఖాన ప్రాంతంలో జీబ్రా క్రాసింగ్ ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు ముఖ్యంగా విద్యార్థులు స్కూల్కు రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఇక్కడ స్కూల్ మాత్రమే కాదు అంగన్వాడి కేంద్రం మరియు బస్తీ దవాఖాన కూడా ఉన్నాయని, ప్రతిరోజు అంగన్వాడీ కేంద్రానికి వచ్చే మహిళలు చిన్నారులు బస్తీ దవాఖాన కు వచ్చే వారందరూ ముఖ్యంగా ముసలివారు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాబట్టి స్థానిక కార్పొరేటర్ ఈ విషయంలో కలగజేసుకుని ఇక్కడ అందరికీ అనుకూలంగా ఉండే జీబ్రా క్రాసింగ్ యుటర్న్ ఏర్పాటు చేయాలని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరడం జరిగింది.