కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు అధైర పడొద్దు -----చలమల్ల కృష్ణారెడ్డి

Published: Wednesday November 09, 2022

చౌటుప్పల్, నవంబర్ 8 (ప్రజాపాలన ప్రతినిధి): మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటమి పాలైన ఎవరు అధైర్య పడొద్దు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కార్యకర్తలను కాపాడుకుంటుందని చలమల్ల కృష్ణ రెడ్డి అన్నారు, ఉప ఎన్నికల ఓటమి కారణాల గురించి మాట్లాడుతూ నాయకులతో కార్యకర్తలతో విశ్లేషిస్తూ తెలుసుకున్నారు ధన బలం అధికార బలం తో గెలిచిందన్నారు కేసీఆర్ ప్రభుత్వం, రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్నారు, ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముప్పిడి సైదులు గౌడ్, మల్కాపురం నరసింహ, ఊదరి శ్యాంసుందర్, నందగిరి భీమయ్య, బోయ దేవేందర్, సుర్వి నరసింహ గౌడ్, ఆకుల ఇంద్రసేనారెడ్డి, ఊదరి నరసింహ, ఊదరి మహేష్, ఊదరి రాజు, తదితరులు పాల్గొన్నారు,