ప్రొఫెసర్ జయశంకర్ 10 వ వర్ధంతి వేడుకలు
మంచిర్యాల టౌన్, జూన్21, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మి నగర్ కాలనీలో సోమవారం తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 10వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికన్నా ముందు ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పలువురు నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం కోట్లడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ ఆకాంక్షలు, 1200 మంది అమర వీరుల ఆశయలు నెరవేరలేదని, జయశంకర్ ఆకాంక్షల కోసం, సామాజిక న్యాయం కోసం, అమర వీరులు కళలు కన్నా ఆత్మ గౌరవం కోసం జయశంకర్ ఇచ్చిన స్ఫూర్తితో మరో పోరాటం చేయాలని ప్రతిజ్ఞ చేశారు.. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గజెల్లి వెంకటయ్య, నాయకులు గుడ రాజిరెడ్డి, జంజిరాల నారాయణ, ఏ.రాజేశం, తుమ్మ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్ బాలకృష్ణ, కృష్ణ రెడ్డి, చొప్ప దండి సతీష్, ఎమ్ కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: