కృష్ణ రైలుబండి నుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రగాయాలైన వ్యక్తిని హాస్పిటల్ కు తరలించిన 108

Published: Wednesday July 14, 2021

బోనకల్, జులై 13, ప్రజాపాలన ప్రతినిధి : మోటమర్రి రైల్వే స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి ట్రైన్డ్ నుండి జారిపడి రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయినాయి ప్రమాదానికి గురైన వ్యక్తి పేరు Sk. బాబు సుభాని ఇతని వయస్సు 26 సంవత్సరాలు ఇతని స్వగ్రామం ఎర్రుపాలెం. ఏర్రుపాలెం నుండి కృష్ణ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఖమ్మం వెళుతుండగా మోటమర్రి రైల్వేస్టేషన్ లో ట్రైన్ లో నుండి కాలుజారి కింద పడిపోవడంతో అతని తలకి మరియు రెండు కాళ్లు క్రింది భాగంలో పాదం దగ్గర తెగిపోవడంతో రక్తస్రావం లో పడి ఉన్న అతని కోసం స్టేషన్ లో ఉన్న వ్యక్తులు 108కు సమాచారం ఇవ్వడంతో బోనకల్ నుండి  108 అంబులెన్సు సంఘటన స్థలానికి చేరుకొని అతనికి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గజ్జలకొండ శివ నాగేశ్వరరావు పైలెట్ కన్నెపోగు మణికుమార్ ప్రధమ చికిత్స అందిస్తూ అతనిని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇతని వివరాలు మధిర Grp police వారికి తెలిచేయడం జరిగింది.