హబ్సిగూడ డివిజన్లో పబ్లిక్ కమ్యూనిటీ ప్రోగ్రాం

Published: Thursday April 13, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 12 (ప్రజాపాలన ప్రతినిధి)

 ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పబ్లిక్ కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని హబ్సిగూడ డివిజన్లోని జేఎస్ఎన్ నగర్ కాలనీలో వివిధ శాఖల అధికారులతో  కలిసి ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి పర్యటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కాలనీలోని వివిధ సమస్యలను తెలుసుకుంటూ స్థానిక కాలనీవాసులు తెలిపే చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తూ పెద్ద సమస్యలను అధికారులకు ఆదేశిస్తూ కాలనీల యొక్క సమస్యలు పరిష్కార దిశగా అధికారులతో కలిసి పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీరు, సీసీ రోడ్లు, రేడియేషన్, విద్యుత్ సమస్యల వినతులను ఎమ్మెల్యేకు విన్నవించగా వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేస్తూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన పాల్ రెడ్డి,ఉప్పల్ డీసీ అరుణకుమారి,  ఈఈ నాగేందర్, డిఈ. నాగమణి, సాయికిరణ్, టౌన్ ప్లానింగ్ ఏసిపి వెంకట్ రమణ, టిపిఎస్ మౌనిక, శానిటేషన్ ఎస్డబ్ల్యుడి ఈ చందన, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమాదేవి, జలమండలి మేనేజర్ ఆసిఫ్, ఎలక్ట్రిసిటీ ఏఈ రాంరెడ్డి, హార్టికల్చర్ సర్కిల్ మేనేజర్ మేధా ,మున్సిపల్ సిబ్బంది. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, హబ్సిగూడ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బి.వి చారి, ప్రధాన కార్యదర్శి కంచర్ల సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.