శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జ

Published: Saturday February 04, 2023

కోరుట్ల, ఫిబ్రవరి 03 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో అలివేలు మంగ సమేత శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజున టిపిసిసి నేత జువ్వాడి కృష్ణారావు  పాల్గోన్నారు.జువ్వాడి కృష్ణారావు కి ఆలయ కమిటీ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కళ్యాణం,ఆన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు పైడిమడుగు గ్రామ సర్పంచ్ భీమారెడ్డి, ఎంపీటీసీ గడికొప్పుల గోపాల్, ఆలయ చైర్మన్ పెద్ది చిన్న గంగారెడ్డి, కోరుట నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, అందే మారుతి, బెజ్జారపు శ్రీనివాస్, అబ్దుల్ ఆఫీజ్,ఎంబరి సత్యనారాయణ, పైడిమడుగు గ్రామ శాఖ అధ్యక్షుడు మర్రిపల్లి జనార్ధన్, ఆశిరెడ్డి రాజేశం, కట్టెకోల రమేష్ నేమిళ్ల మల్లారెడ్డి దొమ్మటి ధర్మపురి, ఆవునూరి కాశిరెడ్డి, సైదు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.