ద్యాచారం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

Published: Tuesday January 31, 2023
* గ్రామ సర్పంచ్ ఎల్లన్నోల అంజయ్య
వికారాబాద్ బ్యూరో 30 జనవరి ప్రజా పాలన : ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి పథకం కల్పతరువుగా నిలుస్తున్నదని ద్యాచారం సర్పంచ్ ఎల్లన్నోల అంజయ్య అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ద్యాచారం గ్రామ సర్పంచ్ ఎల్లన్నోల అంజయ్య ఆధ్వర్యంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ద్యాచారం గ్రామ సర్పంచ్ ఎల్లన్నోళ్ల అంజయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే పరమావధిగా కృషి చేస్తున్నారని కొనియాడారు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వారి ఆర్థిక అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయుటకు కంకణం కట్టుకున్న సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు ద్యాచారం గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా వెంటనే నా దృష్టికి తెచ్చినచో వాటి పరిష్కారం కొరకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పట్లోళ్ళ మల్లికార్జున్, పి.సంగమేశ్వర్, బాల్ రాజ్, పి.సంగెం, పి.గోపాల్, టి.భీమయ్య తదితరులు పాల్గొన్నారు.