ఐకెపి విఓ ల సమస్యలు పరిష్కరించాలి ** సిఐటియూ జిల్లా అధ్యక్షుడు లోకేష్ ** డిఆర్డిఏ పిడి సురేంద

Published: Wednesday February 15, 2023
ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 14 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఆసిఫాబాద్ మండలంలోని ఐకెపి విఓఏ ల సమస్యలు పరిష్కరించాలని వివో ఏ- లు సిఐటియు యూనియన్ నాయకులు, మంగళవారం డిఆర్ డిఏ, పిడి సురేందర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ ఐకెపి వివో ఏ లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఈ సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని అన్నారు. ఐకెపి విఓఏ లకు సర్ఫ్ నుంచి వచ్చే వేతనాన్ని వెంటనే విఓ ఖాతాలలో జమ అయినా ఐకెపి విఓఎ ల గౌరవ వేతనాన్ని సీసీల జోక్యం లేకుండా వెంటనే చెల్లించాలని ఉద్యమం చేశారు. గ్రేడింగ్ పేరుతో జీతాలను డి గ్రేడింగ్ ఇస్తూ సంవత్సరాల తరబడి వివోఏ ల జీతాలను పెండింగ్లో పెడుతున్న సీసీ లపై చర్యలు తీసుకోవాలన్నారు. పిడి వెంటనే స్పందిస్తూ సమస్యల పరిష్కారం కోసం మూడు రోజులలో జాయింట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి, సక్రమంగా జీవితాలు వచ్చే విధంగా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, ఐకెపి వివో ఏ జిల్లా అధ్యక్షురాలు సునీత, కల్పన మహేష్ రమ, శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.