ఓటు నమోదు చేసుకోవాలి : జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్
Published: Thursday December 02, 2021
వికారాబాద్ బ్యూరో 01 డిసెంబర్ ప్రజాపాలన : ప్రత్యేక ఓటర్ల నమోదు, సవరణ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు అందరు తమ పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ సూచించారు. బుధవారం ఎస్ఎపి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఓటర్ అవగాహన సదస్సు లో జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. గరుడ యాప్ ను వినియోగించుకొని ఇట్టి పనులు సులువుగా చేసుకోవచ్చన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎన్నికల స్వీప్ నోడల్ అధికారి కోటాజీ మాట్లాడుతూ, విద్యార్థులు ఓటురుగా నమోదు చేసుకోవడానికి స్థానిక బి ఎల్ వొ ల వద్ద దరఖాస్తు చేసుకువాలని తెలిపారు. కొత్త ఓటర్ గా నమోదు చేసుకోవడానికి ఫారం - 6, అలాగే ఓటురు జాబితాలో చనిపోయిన వారి పేరు తొలగించడానికి ఫారం -7 వినియోగించాలన్నారు. విద్యార్థులు గరుడ యాప్ ద్వారా సులువుగా ఓటురుగా నమోద కావచ్చని, అందరు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని వినియోగించుకొనాలని సూచించారు.
Share this on your social network: