ఫోటోగ్రాఫర్ల ఫోటో ట్రేడ్ ఎక్స్పో పండుగను విజయవంతం చేయాలని ------తూర్పునూరి సాయిలు
Published: Wednesday November 16, 2022
చౌటుప్పల్, నవంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి):
చౌటుప్పల్ మండలం లోని ఫోటోగ్రాఫర్స్ అందరూ ఈరోజు మార్కెట్ యార్డ్ లో హైదరాబాదులో జరిగే ఫోటోగ్రాఫర్ల ఫోటో ట్రేడ్ ఎక్స్పో కు సంబంధించిన వాల్ పోస్టర్లను వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆవిష్కరణ చేయడం జరిగింది చౌటుప్ప మండల ఫోటోగ్రాఫర్ల అసోసియన్ అధ్యక్షుడు తూర్పునూరి సాయిలు, మాట్లాడుతూ తెలంగాణలో జరిగే అతిపెద్ద ఫోటోగ్రాఫర్ల ఫోటో ట్రేడ్ ఎక్స్పో పండుగను విజయవంతం చేయాలని ఫోటోగ్రాఫర్లు అందరూ తరలి రావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు మెట్టు రామచంద్రారెడ్డి, తరపునూరు మల్లేష్, పగడాల శంకర్, రాంబాబు, లక్కు సతీష్, కందగట్ల కృష్ణ, భారత మధు, నాని, మాధవాచారి, తదితరులు పాల్గొన్నారు,
Share this on your social network: