అఖిలపక్షం పార్టీ ల రిలే నిరాహార దీక్ష

Published: Wednesday July 07, 2021
మధిర, జులై 06, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ మధిర ప్రభుత్వ ఆసు పత్రిలో వైద్యుల పోస్ట్లు భర్తీ చేయాలని కోరుతూ అఖిలపక్షం పార్టీల ఆధ్వర్యంలో 8వ రోజు కు చేరిన రిలే నిరాహార దీక్ష ఈ దీక్షలో కూర్చున్న వారు సీపీఐ పార్టీ నుంచి సిపిఎం పట్టణ కార్యదర్శి పెరుమలపల్లి ప్రకాశరావు AITUC మధిర డివిజన్ కార్యదర్శి చెరుకూరి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ ఆదిమూలం శ్రీనివాస రావు గద్దల సురేష్ బాబు నుండి శ్రీనివాస్, టీడీపి నుంచి మన్నేపల్లి రత్నకుమారి మాదాల నరసింహారావు తదితరులు దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్ష శిబిరాన్ని ప్రారంభించిన వారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు, కాంగ్రెస్ పార్టీ sc సెల్ మండల అధ్యక్షులు దారా బాలరాజు, సీపీఐ పట్టణ ప్రధాన కార్యదర్శి బెజవాడ రవి బాబు, సీపీఐ మండల ఓట్ల కొండలరావు సిపిఐ మధిర మండల సహాయ కార్యదర్శి చావా మురళీకృష్ణ, టీడీపీ అధికార ప్రతినిధి గడ్డం మల్లికార్జునరావు, ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్, దీక్ష ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కోన దని కుమార్, ముస్లిం వెల్ఫేర్ కమిటి అధ్యక్షుడు మొహమ్మద్ అలీ, సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు అన్నవరం సత్యనారాయణ మంగళగిరి రామాంజనేయులు చిలువేరు శ్రీను తదితరులు పాల్గోన్నారు..