మిఠాయి తినిపిస్తున్న కాంగ్రెస్ యూత్ నాయకుడు శ్రీనివాస్ ముదిరాజ్

Published: Monday June 28, 2021
వికారాబాద్, జూన్ 27, ప్రజాపాలన బ్యూరో : నూతన టిపిసిసి అధ్యక్షుడు మల్కాజిగిరి ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం వచ్చిందని వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బిజేఆర్ కూడలిలో రేవంత్ రెడ్డిని టిపిసిసి అధ్యక్షునిగా నియమించిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాష్ట్ర ఇన్చార్జ్ మాణికం ఠాగూర్ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన రథసారథి కాంగ్రెస్ పార్టీని విజయ దుందుభి మోగించేలా కార్యాచరణ రూపొందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యకర్తలను చైతన్యపరిచి సమన్వయంతో ఏకతాటిపై నడిపించగల సామర్ధ్యం నూతన నాయకునికి వందకు వందశాతం కలదని సంతోషం వ్యక్తం చేశారు. రథసారథి స్ఫూర్తి మంతంతో, చైతన్యంతో, దూరదృష్టితో తన అనర్గళమైన వాగ్ధాటితో వ్యవహరించడం ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఆవశ్యకమని గుర్తు చేశారు. పటిష్టమైన పట్టుదల గల వ్యక్తి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి పక్కా ప్రణాళిక రూపొందించుకొని రామదండులా కదనరంగంలో పోరాడుతాడని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ అర్థ సుధాకర్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జొన్నల రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.