అనునిత్యం ప్రజలతో మమేకమవుతున్న చేవెళ్ళ ఎంపి రంజిత్ రెడ్డి
Published: Saturday January 07, 2023
* 32వ వార్డు కౌన్సిలర్ మల్లేపల్లి నవీన్ కుమార్
వికారాబాద్ బ్యూరో 06 జనవరి ప్రజాపాలన : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని వికారాబాద్ మునిసిపల్ 32వ వార్డు కౌన్సిలర్ మల్లేపల్లి నవీన్ కుమార్ అన్నారు. చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని వారి నివాసంలో 32 వ వార్డు కౌన్సిలర్ మల్లేపల్లి నవీన్ కుమార్, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెరుకు ఆనంద్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశామని అన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మల్లేపల్లి నవీన్ కుమార్ మాట్లాడుతూ చేవెళ్ల ఎంపీగా గడ్డం రంజిత్ రెడ్డి ఉండడం చాలా సంతోషకరమని కొనియాడారు. ఇలాంటి మహానుభావుడు మన ఎంపీగా రావడం చేవెళ్ల ప్రజల అదృష్టంగా భావించాలని కోరారు. ఎల్లవేళలా ప్రజలతో మమేకమై ప్రజల సమస్యల పట్ల నిరంతరం కృషి చేస్తున్న ఎంపీకి శుభాభివందనాలు తెలిపారు. ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే తన వంతు సహాయ సహకారాలు అందిస్తారని స్పష్టం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వం తరఫున అభివృద్ధికి కావలసిన నిధులను తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారని వెల్లడించారు. కార్యకర్తలకు నాయకులకు మధ్య సమన్వయ లోపాలు జరిగితే వాటిని పరిష్కరించడంలో కూడా ముందుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
Share this on your social network: