ఆనంతయ్య కుటుంబానికి ఆప్తుడిగా ఎస్సై దేవబోంట్ల రాజు

Published: Tuesday May 18, 2021

పరిగి, 17 ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, దోమ మండల పరిధిలోని దిర్సoపల్లి గ్రామంలో ఆదివారం బొల్లం ఆనంతయ్య యొక్క రెండు బర్రె దూడలు కరెంట్ షాక్ తో మృతి చెందిన వార్త ని చూసి దోమ స్టేషన్ హౌస్ అధికారి దేవబోంట్ల రాజు స్పందించి ఆనంతయ్య కుటుంబానికి తన వంతుగా అయిదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కొన్ని పరిస్థితులని మనం తట్టుకొని ముందుకు వెళుతుండలని ఆనంతయ్య కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం దీనితో ఆనంతయ్య రాజు కి కృతజ్ఞతలు తెలిపారు మీ సహాయాన్ని మరవమని వాళ్ళు చెప్పుకొచ్చారు. పత్రిక లలో వచ్చిన వార్తలని ఇంత త్వరగా స్పందించి వాళ్ళని ఆదుకోవడం తో గ్రామ ప్రజలు పెద్దలు రైతులు హర్షం వ్యక్తం చేశారు.