కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ ను కలిసిన కొమిరెడ్డి లింగారెడ్డి

Published: Friday July 09, 2021
మెట్ పల్లి, జూలై 08 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ను గురువారం వెంకటరావుపేట మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు కొమిరెడ్డి లింగారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ప్రచార కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం పట్ల పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.