ఆర్థిక సాయం అందజేత

Published: Wednesday November 02, 2022
చేవెళ్ల నియోజకవర్గం (బ్యూరో)ప్రజా పాలన 
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం  చేవెళ్ల మండలం తల్లారం గ్రామానికి చెందిన వ్యక్తి ని చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు సున్నపు వసంతం కలవడం జరిగింది. మంగళవారం మండల పరిధిలోని తల్లారం గ్రామానికి వెళ్లి బాదీత కుటుంబాన్ని ఓదార్చ కుటుంబ సభ్యులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలయిందని. ప్రభుత్వం వెంటనే మృతి ని కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని అన్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో
 చేవెళ్ల సహకార సంఘం అధ్యక్షులు దేవర వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి యాలాల మహేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ గుండాల రాములు, మాజీ ఎంపీటీసీ పెంటయ్య గౌడ్, తలారం సంజీవ, నవీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,