క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయిజిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు*

Published: Saturday October 15, 2022

మధిర రూరల్ అక్టోబర్ 14 (ప్రజా పాలన ప్రతినిధి) క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల రాజు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఆయన కోరారు.బడుగు బలహీన వర్గాలకు మెరుగైన విద్య అందించాలని ముఖ్యమైన లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలను, కళాశాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుష్మ టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు కూనా నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు