రామంతాపూర్లో ఇంటింటా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు

Published: Wednesday February 02, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి1 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో ఇంటింటా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ రామంతాపూర్ ఇంచార్జీ తవిడబోయిన గిరిబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఉదృతం చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని గిరిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బెజ్జం యాదగిరి, పబ్బోజు బిక్షపతి చారి, వంగాల సతీష్, గౌటి స్వామి, మల్లికార్జున్, పబ్బు గణేష్, మేంగ రవి, దేవేందర్ రెడ్డి,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.