దివ్యాంగులకు లాటరీ పద్ధతి ద్వారా స్వయం ఉపాధి

Published: Friday September 09, 2022

బోనకల్, సెప్టెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని రైతు వేదికలో దివ్యాంగులకు స్వయం ఉపాధి( ఈఆర్ఎస్) లోన్ కొరకు లాటరీ పద్ధతిన డ్రా తీయడం జరిగింది. ఈ స్వయం ఉపాధికి మొత్తం 92 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ శారద శాంతి అధ్యక్షత వహించారు. తీసిన లాటరీ పద్ధతి ద్వారా ఒకటి 50వేల రూపాయలు, ఒకటి లక్ష రూపాయలు స్కీం మంజూరి అయినది. ముగ్గురు మహిళా అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక లక్ష రూపాయల సిమ్ కు ఒక అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్, ఏపీజీవీబీ బ్యాంక్ మేనేజర్ బి సీతారాములు, ఏటీఎం పద్మలత, ఏసీ డిపిఓ కమల ప్రియ, అంగన్వాడి సూపర్వైజర్ రమాదేవి, ఈవో ఆర్ డి హాజరయ్యారు.