అమీర్ పేటలో ఘనంగా తెరాస ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

Published: Thursday April 28, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ) : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమీర్ పేట్ డివిజన్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పలు కాలనీలు, బస్తిలలో పార్టీ జెండా ఎగురవేసి ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మాజీ కార్పొరేటర్ శేషు కుమారి, డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు, సీనియర్ నేత అశోక్ యాదవ్ నేతృత్వంలో బల్కంపేట, బీ జే ఆర్ నగర్, ఎస్ ఎస్ బేకర్ రోడ్డు, ముస్లిం బస్తి, ఎస్ ఆర్ నగర్, సత్యం థియే టర్, ఢిల్లీ మిఠాయి వాల దగ్గర నాయకులు, కార్యకర్తలు పెద్ద యెత్తున పాల్గొని జెండాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్ మని కుమార్, సత్యనారాయణ యాదవ్, కూతురు నరసింహ, వనం శ్రీనివాస్, రాజు ముదిరాజ్, సంపత్, సుమిత్ సింగ్,దర్శన్ సింగ్, కుష్వంత్ సింగ్, ప్రహ్లాద్ సింగ్, జోగిందర్ సింగ్, చరంజీత్ సింగ్, రాజేశ్వరి, గడ్డం బాబురావు, లక్ష్మి, అరుణ, లత ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.