ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి

Published: Friday November 11, 2022

ఘనంగా మరాంరాజు జన్మదిన వేడుకలు జరిపారు*

మండల పరిధిలోని పోల్కంపల్లిలో ప్రముఖ సంఘ సేవకులు మారంరాజు రాఘవరావు జన్మదిన వేడుకలు గురువారం సర్పంచ్ చెరుకూరి అండాలుగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  సర్పంచ్ చేతుల మీదుగా కేక్ కోసి జన్మదిన వేడుకలు జరిపి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గ్రామాభివృద్ధిలో సామజిక వేత మరాంరాజు రాఘవరావు నాటి నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు.విద్యతోనే సమజాభివృద్ధి సాధ్యమని గ్రామంలో ఉన్నత పాఠశాలను నిర్మించి ప్రభుత్వానికి అందించారని తెలిపారు.ఫలితంగా నేడు యువత ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగాలలో స్థిరపడ్డారని చెప్పారు. అలాగే గ్రామంలో  తన   స్వంత నిధులతో సీసీ రోడ్లు ,దేవాలయ నిర్మాణాలు, నిరుపేదలకు ఆర్థిక సహాయం, వంటి కార్యక్రమాలు నిర్వహించి వారికి బాసటగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెరుకూరి మంగ రవిందర్, ఆలయ కమిటీ ఛైర్మన్ మొద్దు బాల్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు పాండురంగం, వార్డు సభ్యులు పి. బాలకిషన్, గ్రామస్తులు డి. నర్సింహా, జి. అశోక్  ఉపాద్యాయులు. తదితరులు పాల్గొన్నారు.