ప్రజాపక్షం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ*

Published: Thursday January 19, 2023

చేవెళ్ల జనవరి 18 (ప్రజాపాలన):-

బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో చేవెళ్ల సర్పంచ్ బండారి  శైలజాఆగిరెడ్డి ప్రజాపక్షం నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న వార్తలను ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో పాత్రికేయుల పాత్ర కృషి ఎనలేనిదని అన్నారు. పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిల పనిచేస్తున్నాయని  అన్నారు. డిసిసి ఉపాధ్యక్షులు బండారి ఆగి  రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ గంగి యాదయ్య, రవీందర్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి రిపోర్టర్లు శేఖర్,నర్సింలు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.