సీనియర్ స్టాఫ్ నర్స్ ను సన్మానించిన ఆసుపత్రి సిబ్బంది

Published: Friday September 23, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి: స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో  అసిస్టెంట్ మ్యాట్రన్ గా  పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ దాసరి అరుణాసుందరిని  ఏరియా ఆసుపత్రి సిబ్బంది గురువారం ఘనంగా సన్మానించారు.
గత 40 సంవత్సరాలుగావివిధ సింగరేణి ఆసుపత్రులలో స్టాఫ్ నర్స్ గా పని చేస్తూ పదవి విరమణకు  చేరువలో ఉన్న అరుణాసుందరిని పుట్టినరోజు సందర్భంగా గురువారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమెను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అరుణసుందరి, డ్యూటీ విషయంలో ఎంతో నిబద్ధతతో, చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటుందని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తూ, పలువురికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఇకముందు కూడా డ్యూటీలో ఉన్నా, లేకపోయినా రోగుల సేవకు సేవ చేసేందుకు అంకితం కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డివైసి ఎం ఓ  రామాల శౌరి, డాక్టర్లు మురళీకృష్ణ, డా'' లలిత, ఏరియా ఆసుపత్రి టీబీజీకేఎస్ ఫిట్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, నర్సింగ్ సిబ్బంది, వార్డు అసిస్టెంట్లు, ఎస్ఎన్ ఎస్ కార్మికులు, జనరల్ మజ్దూర్లు, మహిళా కార్మికులు, తదితరులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.