దేశినేనిపాలెం గ్రామంలో పల్లె ప్రగతి పనులను తనిఖీ

Published: Thursday July 08, 2021
మధిర మండలం దేశినేనిపాలెం గ్రామంలో జరుగుతున్నటువంటి పల్లె ప్రగతి పనులను మధిర ఎంపీపీ మొండెం లలిత గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్లె ప్రగతి పనులు ఏ విధంగా జరుగుతున్నది సర్పంచ్ మరియు సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు, ఈ సందర్భంగా సైడ్ డ్రైనేజీ లను పరిశీలించి కాలువలను త్వరగా శుభ్రం చేయాలని సూచించారు, రోడ్లకు ఇరువైపులా ఉన్న కంచెను, గడ్డిని తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. మొక్కలను అధికంగా నాటి వాటిని పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా SC అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల ఝాన్సీకిరణ్ సెక్రెటరీ శ్రీ విద్యా, పంచాయతీ సిబ్బంది మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.