గ్రామానికి బాడీపెజర్ విరాళం అందుచేత

Published: Tuesday December 27, 2022

జన్నారం, డిసెంబర్ 26, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గుడిమడుగు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ శోభా దేవి జ్ఞాపకార్థం వారి కొడుకులు శ్రీనివాస్ వేణుగోపాల్ రంగనాథ్ లు 50 వేల విలువైన బాడీ ఫ్రీజర్ ను గ్రామ సర్పంచి వార్డు సభ్యులు సమక్షంలో మురిమడుగు గ్రామానికి బాడీ ఫ్రీజర్ విరాళం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి బాడీ ఫ్రీజర్ అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా దాతలు ఉంటే గ్రామానికి ఉపయోగపడే పరికరాలను అందజేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోలి రామచందర్ రెడ్డి, కమలాకర్ రావు, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.