హబాబు జగ్జీవన్‌ రామ్ కి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి

Published: Wednesday April 06, 2022
మధిర ఏప్రిల్ 5 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మండల కాంగ్రెస్ ఆధ్వర్యం లోమంగళవారం నాడు మండల కాంగ్రెస్ కార్యాలయంలో బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ జయంతి సందర్భంగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రావ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య‌ స‌మ‌ర యోధుడు, జ‌నం కోస‌మే త‌న జీవితాన్ని అంకితం చేసిన నాయ‌కుడు బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా, ఉప ప్ర‌ధానిగా ఆయ‌న దేశానికి అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. సమసమాజ నిర్మాణం కోసం జీవితాంతం పోరాడిన చైతన్య మూర్తి, భారత్ మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ దళిత హక్కుల పరిరక్షకులు జగ్జీవన్ రామ్  జీవితం స్ఫూర్తిగా మనందరం బడుగువర్గాల అభ్యున్నతి కోసం కృషి చేద్దామని సూచించారు.సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ చేసిన పోరాటం దళిత జాతిని జాగృతం చేసిందని అన్నారు.. ప్రతి ఒక్కరు బాబు జ‌గ్జీవ‌న్ రామ్‌ ని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు మండ ల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్లు కోన ధనికుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పారుపల్లి విజయ్ కుమార్ మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు మువ్వ వెంకయ్య బాబు పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు షేక్ బాజీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్యా ఆదూరు శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు మాగం ప్రసాద్, ఆదిమూలం శ్రీనివాసరావు, మైలవరపు చక్రి, షేక్ ఇస్మాయిల్ వాసంశెట్టి జనార్దన్ రావు మొదలగువారు పాల్గోన్నారు....