తెలంగాణ ప్రభుత్వం లో మధిర మున్సిపాలిటీ అభివృద్ధి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్
Published: Friday February 10, 2023
పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ మధిర రూరల్ ఫిబ్రవరి 9 ప్రజా పాలన ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీ ప్రజలందరూ సహకారంతో అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నే మధిర పట్టణ అభివృద్ధి.
మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.30 కోట్ల రూపాయలు కేటాయించిన కేసీఆర్ కి ప్రజలంతా మద్దతుగా నిలవాలి ప్రజలందరి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టాలని గుడ్ మార్నింగ్ మధిర చేపట్టాం.మధిర పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రగతి పథంలో నిలుపుతాం. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ట్యాంక్ బండ్ సహా 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, సెంట్రల్ డివైడర్ లైటింగ్ తో పాటుగా పట్టణ సుందరికరణ చేశాం
ఎన్నికల సమయంలో వచ్చి మాయ మాటలు చెప్పే వారికి తగిన గుణపాఠం చెప్పి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించండి
మున్సిపాలిటీలో పలు వార్డుల్లో 16 17వ వార్డు ప్రజాప్రతినిధులకు కలిసి జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు 16 17 ఆమెవార్డుల్లో ఉన్న సమస్యలపై ఉదయాన్నే ప్రజాప్రతినిధులతో కలిసి వాకింగ్ చేస్తూ ప్రజల సమస్యలపై తెలుసుకుంటూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణరాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నే మధిర పట్టణ అభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్మన్, బీ.ఆర్.ఎస్ పార్టీ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు గురువారం నాడు మధిర పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన గుడ్ మార్నింగ్ మధిర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అందులో భాగంగా పలు వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ మొండితోక లత మరియు వార్డు కౌన్సిలర్ల తో కలసి మార్నింగ్ వాక్ చేస్తూ వార్డులు మొత్తం కలియ తిరిగారు. ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల పరిష్కారం తో పాటుగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రజల తో చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 16 17 లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తామని వారు పేర్కొన్నారు 16 17 వార్డ్ లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను సీనియర్ సిటిజన్ వారి కొరకు పార్కు నిర్మాణం త్వరలోనే పరిశీలిస్తానని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొండితోకలత జయకర్ వైస్ చైర్మన్ విద్యాలత వెంకటరెడ్డి సొసైటీ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్ బి వి ఆర్ కమిషనర్ రమాదేవి పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు అరిగి శ్రీనివాస్ అప్పారావు మాధవి కృష్ణ సుధాకర్ శివాలయం చైర్మన్ నాగేశ్వరావు వినయ్ కుమార్ జీవి రెడ్డి నారాయణరావు పలువురు వార్డు కౌన్సిలర్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు
Share this on your social network: