పూజలు చేసిన తహశీల్దార్ రాఘవరెడ్డి, రామ బ్రహ్మరెడ్డి..

Published: Friday October 07, 2022
 తల్లాడ, అక్టోబర్ 6 (ప్రజాపాలన న్యూస్)
 
తల్లాడ మండలంలోని నారాయణపురం గ్రామంలో దేవిశరన్నవరాత్రుల్లో భాగంగా చివరిరోజు బతుకమ్మలను ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఊరేగింపు కార్యక్రమంలో నారాయణపురం గ్రామవాసి, తొర్రూరు తహశీల్దార్ వేమిరెడ్డి రాఘవరెడ్డి, తల్లాడకు చెందిన ప్రముఖ న్యాయవాది గుర్రాల రామబ్రహ్మరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భారీ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బతుకమ్మ ఊరేగింపులో పాల్గొంటున్నానని, స్వగ్రామంలో వేడుకలకు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవార్ల దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, పాడిపంటలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొడుగునూరి లక్ష్మారెడ్డి, మల్లవరం ఉప సర్పంచ్ ఎర్రి నరసింహారావు, భక్తులు పాల్గొన్నారు.