సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తిరపతయ్యకు ఘన నివాళి సంతాపం తెలిపిన డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ

Published: Tuesday August 30, 2022

బోనకల్, ఆగస్టు 29 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామానికీ చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెల్లబోయిన తిరపతయ్య ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మరణ వార్త విని చొప్పకట్లపాలెంలో ఆయన పార్టీవదేహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మండల కాంగ్రెస్ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, మండల అద్యక్షుడు గాలి దుర్గారావు, డీసీసీ కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్ మాట్లాడుతూ... తిరపయ్య మృతీ పార్టీ కి తీరనిలోటని వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కాంగ్రెస్ పార్టీ బోనకల్ మండల కమిటీ తరుపున సంతాపం తెలియ పరుస్తూ వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయనకు సంతాపం తెలిపిన వారిలో జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, మండల వైస్ ఎంపీపీ గు గులోత్ రమేష్ ,మండల కో ఆప్షన్ సభ్యులు, ఎస్ కే జమాలుద్దీన్, తెలుగుదేశం పార్టీ బోనకల్ మండల కమిటీ సంతాపం తెలియజేశారు.